
పయనించే సూర్యుడు, డిసెంబర్ 27 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక లే పండుగలు.సంక్రాంతి పర్వదినాన్ని పురస్కారించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీ లలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.ప్రతి కాల నీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ 5 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు హఫీజ్ పేట విలేజిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.విజే తలకు బహుమతి ప్రదానం చేసిన అనం తరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరిశెట్టి సాయిబాబా ఫ్రెండ్స్ వెల్ఫే ర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవులు మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళ వింపే ముగ్గులు”అని అన్నారు. “ఈ పోటీ ల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుం ది.పట్టణీకరణ నేప థ్యంలో అపార్టుమెం ట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీ య సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవు తున్నాయి.నేటి యువత రం కూడా మన ప్రాచీన సంస్కృతి, సంప్ర దాయాలు కొనసాగించేందుకై ఈ పోటీలు నిర్వహిస్తు న్నాము “అని అన్నారు. “ఈ ముగ్గుల వలన పరిసరాలు పరిశుభ్రతగా ఉంటాయి. గోమయంతో కళ్ళాపి జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేయడం వలన బియ్యపు పిండి తినడానికి చీమ లు చేరతాయి. ఆ విధంగా చీమలు క్రిమి కీటకాదులు ఇంటిలోనికి రాకుండా అడ్డు కుంటాయి. ఈ ముగ్గులు వేసే ప్రక్రియలో మహిళలు అనేక శరీరక భంగిమలలో పనిచేయ వలసి ఉంటుంది. ఈ వ్యా యామ ప్రక్రియ వలన మహిళలలో అనేక గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కావున ప్రతి మహిళ కూడా ప్రత్యేకించి ఈ ధనుర్మాసం మొత్తం నెల రోజులు అత్యంత ఉత్సాహంగా వేకువ ఝామున లేచి ముగ్గులు వేయడం ప్రారం భిస్తారన్నారు. ఈ పోటీలలో విజయ లక్ష్మి రమ్య విజేతలను ఎంపిక చేశారు.ఈ పోటీలలో 25 మంది మహి ళ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాలు ఆషా రాధ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తది తరులు పాల్గొ న్నారు.