పయనించే సూర్యుడు డిసెంబర్ 27 కరీంనగర్ న్యూస్: దుబ్బపల్లి గ్రామ ప్రజలు అందరూ భారీ మెజార్టీతో గెలిపించినందున గ్రామ ప్రజలకు నమస్కారాలు దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ మోతె ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను త్వరలోనే ప్రారంభించి ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని అన్నారు సచ్చు భారత్ కార్యక్రమంలో దుబ్బపల్లి గ్రామాన్ని కరీంనగర్ రూరల్ మండలంలోని మొదటి స్థానంలో ఉండడానికి కృషి చేస్తామని అన్నారు గ్రామ ప్రజలు పాలక వర్గం తో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా చేసినాము గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం తో దుబ్బపల్లి గ్రామమును జిల్లాలోని మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు రైతులకు ఐకెపి సెంటర్ మరియు అక్కాచెల్లెళ్లకు దసరా పండుగ వరకు బతుకమ్మ షూట్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు అర్హులకు రేషన్ కార్డులు ఇప్పిస్తామని అన్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని అన్నారు గ్రామంలో విధి దీపాలను ఎప్పటికప్పుడు పెట్టిస్తామని అన్నారు గ్రామంలో నూతన సిసి రోడ్లు డ్రైనేజీలు గ్రామం శుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు గ్రామ ప్రజలతో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ గ్రామంలో అందుబాటులో ఉంటాము ఏ కష్టం వచ్చినా మీ వెంటే ఉంటూ ప్రజల కష్టాలను మా కష్టాలుగా ముందుంటామని అన్నారు మేము ఇచ్చిన హామీలను ప్రజలతో మమేకమై వాటిని అధికారుల దృష్టికి తీసుకుపోయి సాంక్షన్ చేయించుకొని మాకు ఉన్న సమయంలో వాటిని పూర్తి చేస్తామని అన్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిస్వార్థపరులు అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటామని అన్నారు ఈయొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
