పయనించే సూర్యుడు డిసెంబర్ 28 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ శనివారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టేం రిజర్వాయర్ మరియు పంపు హౌస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు నివారణపై ఆరా గతంలో భారీ వరదలు వచ్చిన సమయంలో పంపు హౌస్ నీట మునిగిన విషయాన్ని కవిత గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టారు, రక్షణ గోడల నిర్మాణం మరియు ఇతర సాంకేతిక జాగ్రత్తల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రై రన్ పరిశీలన పంపు హౌస్లో మోటార్ల పనితీరును ఆమె పర్యవేక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పంపుల డ్రై రన్ ప్రక్రియ, విద్యుత్ సరఫరా మరియు నీటి తరలింపు సామర్థ్యంపై అధికారులతో చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులు రైతులకు త్వరితగతిన అందుబాటులోకి రావాలని, పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఆమె సూచించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు మరియు తెలంగాణ జాగృతి ప్రతినిధులు పాల్గొన్నారు.