హైదరాబాదుకు బయలుదేరిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 నేరేడుచర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమం గుణ పాఠాలు కర్తవ్యాల సదస్సు ను విజయవంతం చేయాలని ఈరోజు నేరేడుచర్ల మిర్యాలగూడ రోడ్డు సిపి ఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో హైదరాబాదుకు బయలుదేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ హుజూర్నగర్ డివిజన్ కార్యదర్శి వాసపల్లయ్య ఇట్టి సదస్సును విజయవంతం చేయాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ హుజూర్నగర్ డివిజన్ సభ్యులువాసకరుణాకర్, షేక్ రజాక్, సైదులు వీడియోస్ జిల్లా నాయకులు మాతాంగి విజయ్ పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యురాలు చందనబోయిన లక్ష్మి, సయ్యద్ రేష్మ,శ్యామల , మరియమ్మ మల్లేశ్వరి మరియు ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నుండి బైరం ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.