బోయిన్ పల్లి మండలంలో రాష్ట్ర మాజీ సర్పంచ్ల జై ఏ సి చైర్మన్ అరెస్ట్

★ మాజీ సర్పంచుల గొంతు నొక్కుతున్న ప్రభుత్వం: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన నేతల అరెస్టులు! ★ బిల్లులు అడిగితే అరెస్టులా? ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైంది? ★ బకాయిలు చెల్లించకుంటే పల్లెలు తిరగబడతాయి! మాజీ సర్పంచుల అరెస్టులపై జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ ఆగ్రహం

పయనించే సూర్యుడు బోయిన్ పల్లి డిసెంబర్ 30 2025(మధులత రాగేటి) గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి, నిధుల కోసం ఎదురుచూస్తున్న తాజా మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని 'తాజా మాజీ సర్పంచుల జేఏసీ (JAC)' తీవ్రంగా ఖండించింది. పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో, రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులను పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడంపై జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, సర్పంచులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడం ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. 2019-24 కాలంలో సర్పంచులు తమ సొంత నిధు