పయనించే సూర్యుడు, డిసెంబర్ 31 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలం గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలేనని గ్రామాల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు కాయితి ఆశాదీప్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదులో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నూతన సర్పంచుల సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సర్పంచ్ కాయితి ఆశాదీప రెడ్డిని రాష్ట్రంలో గల అన్ని గ్రామాల సర్పంచులు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు గా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని తాండ్ర గ్రామ సర్పంచ్ కాయితి ఆశాదీప్ రెడ్డి హైదరాబాద్ లో మంగళవారం రోజు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నూతన సర్పంచ్ ల సమావేశం లో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదని భూమన్న యాదవ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, రాష్ట్రం లోని అన్ని గ్రామాల సర్పంచులు ఏకాభిప్రాయంతో ఆయనను సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదని భూమన్న యాదవ్ నియామక పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాయితీ ఆశాదీప్ రెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి సాధించేలా సర్పంచులందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. గ్రామాల మధ్య సమన్వయం పెంచి, స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో సర్పంచుల సంఘం కీలక పాత్ర పోషిస్తుందని గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను సమిష్టిగా పరిష్కరించేందుకు సర్పంచులందరితో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా సర్పంచులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా సర్పంచుల సంఘాన్ని బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల సర్పంచులు పాల్గొన్నారు.