నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

★ పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్

పయనించేసూర్యుడు, డిసెంబర్ 31 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలే తప్ప విషాదాన్ని మిగిలిచేలా చేసుకోవద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు, ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కేసుల్లో ఇరుక్కున్న యువత భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉందాని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడ వద్దని ఆయన సూచించారు. మద్యం మత్తులో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, దీంతో కుటుంబం వీధిన పడాల్సి వస్తుందని ఆయన సూచించారు. అలాగే తాగి పోట్లాటలకు దిగొద్దన్నారు, ఎవరైనా మద్యం సేవిస్తే డ్రైవింగ్ కు డ్రైవర్ వినియోగించు కోవాలని సూచించారు. డిసెంబర్ 31 తో పాటు జనవరి ఒకటిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు