పి వెంకటాపురం అభివృద్ధి చేస్తా ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభించినలో ఎమ్మెల్యే నానాజీ

పయనించే సూర్యుడు డిసెంబర్ 31, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా 56 లక్షల రూపాయలతో అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని రోడ్లు ట్రైన్లు ఇప్పటికే నిర్మించామని అలాగే వారికి ఏ కావలసిన పనైనా వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, టిడిపి నాయకులు పెంకె బాబా, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఎండిఓ సతీష్ పంచాయతీ కార్యదర్శి బేగం, ఉప సర్పంచ్ పెంకే సోమరాజు కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *