వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న

★ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన ధర్మపత్ని సమేతంగా వైకుంఠ ఏకాదశి పవిత్ర సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం కలగడం అదృష్టంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే దంపతులు, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, రైతులు, యువత, మహిళలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు. అలాగే అశ్వారావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని భక్తి పరవశులయ్యారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులు తిరుమలలో దర్శనం చేసుకున్న విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో మరింత ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.