పయనించే సూర్యుడు జనవరి 1 కరీంనగర్ న్యూస్: బెంగాల్ తమిళనాడు ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ద్రుష్టి మొత్తం తెలంగాణపైనే సారించబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సంపూర్ణం చేస్తామని చెప్పారు ఈరోజు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు బీజేపీ కార్యకర్తల త్యాగాలు పోరాటాలతో కమ్యూనిస్టు కంచుకోట కేరళ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేస్తున్నా మహిళా మోర్చా కార్యకర్తలపై అత్యాచారం చేసినా వెనకంజ వేయకుండా బెంగాల్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారని చెప్పారు. హైకమాండ్ ద్రుష్టి అంతా త్వరలోనే తెలంగాణలో కేంద్రీక్రుతం చేయబోతోందని బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు