మొండికుంట వద్ద కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా – 60 మంది విద్యార్థులకు గాయాలు

పయనించే సూర్యుడు ,జనవరి 03 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్వంచలోని కేఎల్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది విద్యార్థినీ, విద్యార్థులు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం కాగా, ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రులకు ఇతర వాహనాల్లో తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా, సమాచారం అందిన వెంటనే స్థానికులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *