సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా సన్మానం

పయనించే సూర్యుడు గాంధారి 04/1/26 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధారి మండల తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు. మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానం. స్త్రీ విద్యే సమాజ విముక్తికి మూలమని నమ్మి, సమాజంలోని కట్టుబాట్లను ఎదురించి, అణగారిన వర్గాల కోసం మరియు మహిళల చదువు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే. ఆమె చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆమె జయంతిని పురస్కరించుకునీ గ్రామంలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారూ. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంగారు శంకర్, గ్రామ పెద్దలు, యువకులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *