ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్అండ్ కొమిరిశెట్టి ఫౌండేషన్ఆద్వార్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు

పయనించే సూర్యుడు, జనవరి 06 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు. సంక్రాంతి పర్వ దినాన్ని పురస్కారించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీ లలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కాల నీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయం 5 ప్రోత్సా హక బహుమతులు అందజేయడం జరుగు తుంది.దీనిలో భాగంగా ఆదివా రం విభావరి టవర్స్,బిహెచ్ఎల్ ఎంఐజి కాలనీ జనని మహిళామండలి,సింధు ఆదర్శ్ మహిళామండలి చందానగర్ లోగల వెంకటాద్రి కాలనీ,మియా పూర్ లోగల న్యూ కాలనీ, నగర్ మొదలగు కాలనీ లలో మహళలకు ముగ్గుల పోటీ లు నిర్వహించడం జరిగింది. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరి శెట్టి సాయిబాబా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వా మి యాదవులు మాట్లాడుతూ పరిశుభ్ర త, ఆరోగ్యం, అలంకరణల మేళ వింపే ముగ్గులు “అని అన్నారు. ” ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టణీక రణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృ తి పెరిగిన తరువాత భారతీయ సంస్కృ తి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగ వుతున్నాయి. నేటి యువ తరంకూడా మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కొనసా గించేందుకై ఈ పోటీలు నిర్వహి స్తున్నాము ” అని అన్నా రు. “ఈ ముగ్గుల వలన పరిసరాలు పరి శుభ్రతగా ఉంటాయి. గోమయంతో కళ్ళా పి జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేయడం వలన బి య్యపు పిండి తినడా నికి చీమలు చేర తాయి. ఆ విధంగా చీమలు క్రిమికీటకాదులు ఇంటిలోనికి రాకుండా అడ్డు కుంటాయి. ఈ ముగ్గులు వేసే ప్రక్రియలో మహిళలు అనేక శరీరక భంగిమలలో పనిచే యవలసి ఉంటుంది. ఈ వ్యాయామ ప్రక్రియ వలన మహిళ లలో అనేక గర్భ కోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కావున ప్రతి మహిళ కూడా ప్రత్యేకించి ఈ ధనుర్మాసం మొత్తం నెల రోజులు అత్యంత ఉత్సాహంగా వేకువ ఝాము న లేచి ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు” అని అన్నారు. ఈ పోటీ లలో వాణి సాంబశివరావు, ఉమా చంద్ర శేఖర్ విజే తలను ఎంపిక చేశారు. ఈ పోటీలలో 40 + 25 + 20 +30+20+15 మంది మహిళలు పాల్గొ న్నారు. ఈ కార్య క్రమం లో కాలనీ వేల్ఫేయిర్ అసోసియో షన్ నాయకులు బి ఎన్ రెడ్డి, రాజేష్, శ్రీ నివాస్ వివిధ కాలనీలలోని మహిళా నాయకు రాళ్ళు శ్రీమంతులు వరలక్ష్మి, వాణి, కుమారి, రాణి యాదవ్, నాగమణి మాజీ కౌన్సిలర్ లక్ష్మి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియే షన్ సభ్యుడు అమ్మ య్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *