రాజకీయ పార్టీల సమావేశం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా అశ్వారావుపేట పురపాలక సంఘ కార్యాలయములో ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం కమిషనర్ బి. నాగరాజు ఆద్వర్యం లో సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణ లో భాగంగా ఓటర్ జాబితా, ఎన్నికల పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారిగా ఓటర్ల వివరాలను ఆయా పార్టీల నాయకులకు అందు ప్రతులను అందజేసినారు. అనంతారం కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 9 వరకు ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా రాతపూర్వకంగా వివరించాలని సూచించారు. ఇందుకు పోలింగ్ స్టేషన్లు మార్చాలని వచ్చిన అభ్యంతరాలపై పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశములో రాజకీయ పార్టీల నాయకులు మెట్ట వెంకటేష్, బి. చిరంజీవి, యూఎస్ ప్రకాష్ రావు, బత్తిన పార్ధసారధి, తుమ్మ రాంబాబు, చిన్నం శెట్టి సత్యనారాయణ, బూసి పాండురంగ రావు, నార్లపాటి శ్రీనివాసరావు, డెగల రామచంద్ర రావు, గన్నిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *