పయనించే సూర్యుడు జనవరి : 7 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు తన కుమారుడు ఎస్వీఎస్ సుధీర్ బాబు జ్ఞాపకార్థంగా జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు వాటర్ కూలింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. వీటిని మంగళవారం జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, సుధీర్ బాబు పరమపదించి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా పులిహోర, దద్దోజనం, మజ్జిగ పంపిణీ చేయడం, అలాగే క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేస్తున్న ఎస్వీఎస్ అప్పలరాజు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ వైభోగుల కొండబాబు యాదవ్, సాంబత్తుల చంద్రశేఖర్, కోడూరి రమేష్, బండారు నాని, కోండ్రోతు రమణ, సాంబత్తుల రాజేష్ పాల్గొన్నారు. అలాగే డాక్టర్లు ప్రణీత్, నీలిమ, వర్మ, వినుషా, లక్ష్మీ, శ్రావణి సంధ్య, మాధురి తదితరులు హాజరయ్యారు.