
పయనించే సూర్యుడు జనవరి 7 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం యనమదల . కోటితీర్థం రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హిమబిందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా రైతులు అందరూ ఏ పి ఎఫ్ ఆర్ పోర్టల్ రిజిస్టర్ కానీ వాళ్ళ పేర్లు ఆర్ ఎస్ కె వారిగా వచ్చి ఉన్నాయి. వాళ్ళు వెంటనే ఆ రైతు సేవ కేంద్రం లో ఏపీ ఎఫ్ ఆర్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలానే ప్రతి రైతు సాగుచేసిన ప్రతి పంటను పంట నమోదు చేసుకోవాలని, తెలియజేయడం జరిగినది ఈకార్యక్రమంలో ఏ ఈ ఓ ఎల్ .సుజాత, వి ఏ ఏ ఎస్ రూప, హాసన్ కుమార్ గ్రామ వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు