రత్నవరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యడు జనవరి 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు ఎస్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎస్టీయూ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ఆవరణలో క్యాలెండర్‌ను విడుదల చేశారు. ​డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలి ​ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ముఖ్యంగా: ​డీఏ & పీఆర్సీ: పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ​టెట్ మినహాయింపు: సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ​హెల్త్ కార్డులు: ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య పథకాన్ని (హెల్త్ కార్డులు) వెంటనే అమలు చేయాలన్నారు. ​పాల్గొన్న నాయకులు ​ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నడిగూడెం మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటాచారి, మంద పుల్లయ్యలతో పాటు నాయకులు ఖాసీం, నరేందర్, కరుణాకర్, రజిని, ప్రమీల, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *