విద్యాభ్యాస ఖర్చులను తానే భరిస్తాను

* టిఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏల సుందర్

పయనించే సూర్యుడు జనవరి 8 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త దండంపల్లి సోమేశ్వర(35)ఈరోజు ఉదయం మరణించగా వారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన దేవరుప్పుల మండల టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏల సుందర్ దండంపెల్లి సోమేశ్వర్ కి ఒక కూతురు,కుమారుడు ఉండగా, కూతురు 1వ తరగతి చదువుతోంది.ఆ అమ్మాయి పూర్తి విద్యాభ్యాసానికి (ఎంత వరకు చదివితే అంత వరకు) అయ్యే ఖర్చును పూర్తిగా తానే బరిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చిన ఏల సుందర్.ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్, టిఆర్ఎస్ గ్రామ పార్టీ కార్యదర్శి జోగు అయిలుమల్లు,సీనియర్ నాయకులు కారుపోతుల భిక్షపతి,ఉప్పల్ రెడ్డి,చింత మలయ్య, నర్రా సోమశేఖర్,తోటకూర దశరథ, కారుపొతుల సందీప్, ఉప్పుల సోమయ్య,అలకుంట్ల వెంకన్న,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *