అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ జనవరి 09. నల్లగొండ పట్టణంలోని ఆర్జాల బావి వల్లభ రావు చెరువు సుందరీకరణ & అభివృద్ధి పనులకు ₹3 కోట్ల 14 లక్షల 60 వేల అంచనా వ్యయంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చెరువు అభివృద్ధితో వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపు, పచ్చదనం విస్తరణకు దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు. నల్లగొండ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.