పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10: ఈరోజు అశ్వాపురం మండలం, అశ్వాపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వీ డబ్ల్యు ఎస్ సి సమావేశంలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు లకి శాలువాతో హెల్త్ డిపార్ట్మెంట్ వారు సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అశ్వాపురం గ్రామపంచాయతీలో అంగన్వాడీ టీచర్ల, ఆశాలు, ఏ ఎన్ ఎం లు వారి యొక్క సేవలు అమోఘం మని ఇంకా మరింత వారి సేవలు అందించాలని, ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎం లు ప్రతిరోజు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా నడుచుకోవాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని వారిని కోరారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు , ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు,గ్రామపంచా సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.