వైద్యశాఖ మినిస్ట్రియల్ ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

* మినిస్టర్ ఫోరం జిల్లా అధ్యక్షులు సుదర్శన్ కార్యదర్శి విజేందర్ సంస్కృతిక విభాగం కార్యదర్శి చెన్నకేశవ్

పయనించే సూర్యుడు జనవరి 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా కార్యాలయం,వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వివిధ జిల్లా ఉప ఆరోగ్య కార్యాలయం లలో పనిచేస్తున్న మినిస్టర్స్ సిబ్బంది మినిస్ట్రియల్ ఫోరం కమిటీని శుక్రవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మినిస్టర్ ఫోరం జిల్లా అధ్యక్షులుగా సుదర్శన్ కార్యదర్శిగా విజేందర్ కోశాధికారిగా నదీమ్ సల్మాన్ అసోసియేటు అధ్యక్షునిగా భరత్ కుమార్, ఉపాధ్యక్షులుగా బుచ్చయ్య,హరికృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, మహిళా ఉపాధ్యక్షులుగా అవనిజ, పార్వతమ్మ, ఉప కార్యదర్శిగా వెంకటేష్, జ్ఞానేశ్వర్, అన్వర్ బేగం, ప్రియాంక నిర్వహణ కమిటీ కార్యదర్శిగా నాగయ్య, సాంస్కృతిక కార్యదర్శిగా చెన్న కేశవ్,జిల్లా అడక్ కమిటీ సభ్యులుగా పి.కృష్ణయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ రెండు సంవత్సరాలుగా ఫోరం సేవలు అందిస్తారని అధ్యక్షులు సుదర్శన్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *