లట్టుపల్లి గ్రామంలో బిజినపల్లి మండలం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

* మొదటి బహుమతి 30 వేల రూపాయల రెండో బహుమతి 20వేల రూపాయలు

పయనించే సూర్యుడు జనవరి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు నిర్వాహకులు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌లో మొదటి బహుమతిగా రూ.30,000, రెండో బహుమతిగా రూ.20,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమ ప్రారంభ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరిచిన అతిథులు క్రీడల ద్వారా శారీరక, మానసిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, శివయ్య యాదవ్, సంతోష్ రెడ్డి, శేఖర్ గౌడ్, వంశీధర్ రెడ్డి, వెంకటయ్య, జియాజి, రాజేందర్ గౌడ్, శేఖర్ శెట్టి, ఉపేందర్ రెడ్డి, మీ సేవ కృష్ణ తదితరులు పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *