పయనించే సూర్యుడు,అశ్వాపురం, జనవరి 13: అశ్వాపురం గ్రామపంచాయతీ లోని గల మెయిన్ రోడ్డు విస్తరణ పనులను అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పర్యవేక్షించారు, ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులను ఈ రోజ మొదలు పెట్టినారు. దుమ్ము, ధూళితో కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అశ్వాపురం వ్యాపారస్తులకు, గృహస్థులకు ఈ రోజు నుంచి విముక్తి కలిగింది అని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరియు ఆర్ అండ్ బి అధికారులకు కృతజ్ఞతలు తెలియచేసిమారు. ఇట్టి కార్యక్రమంలో అశ్వాపురం ఉపసర్పంచ్ శ్రీ తుళ్లూరు ప్రకాష్ రావు, డి.ఈ సతీష్ ,ఏ.ఈ శ్రవణ్, కాంట్రాక్టర్ సురేష్ ఆర్ అండ్ బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.