పలాస ఆలయంలో దొంగలు హల్ చల్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోగల చిన్న తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వర స్వామి ఆలయం లో గత రాత్రి దొంగతనం జరిగింది .ఈ విషయాన్ని ఆలయకర్త హరి ముకుందపండ తెలిపారు. వెంకటేశ్వర స్వామి నామాలు వెండి సామాను బంగారు ఆభరణాలు మూడు హుండీలు దొంగిలించబడ్డాయని ఆయన విలేకరులకు తెలిపారు సుమారు 80 లక్షల రూపాయలు వరకు ఆలయంలో చోరీ జరిగిందనీ దోపిడి జరిగిందన్న విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.గత రాత్రి కూడ పూజలు నిర్వహించామనీ, ఉదయం స్వామి వారి పూజకు ఆలయానికి చేరుకున్న సమయంలో ఆలయం తాళాలు విరిగినట్లు తెలుసుకున్న వెంటనే పోలీసులకు తెలిపామని ఆయన అన్నారు.