ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమావేశం

పయానించే సూర్యుడు జనవరి 14 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ సమావేశం ము హుస్సేన్ పీరా అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రైతు సంఘం గౌరవ అధ్యక్షులు కే లక్ష్మారెడ్డి. రైతు సంఘం ఆదోని నియోజకవర్గం కార్యదర్శి బసాపురం గోపాల్ . సిపిఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు. పాల్గొని వీరు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరుగు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సత వార్షికోత్సవాలు జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు కాబట్టి మన గ్రామం నుండి అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవ అధ్యక్షులుగా హుస్సేన్ పీరా అధ్యక్షులుగా వీరస్వామి కార్యదర్శిగా ఈరన్న కోశాధికారిగా వీరన్న వీరుతోపాటు 21 ఒక్క మందిని సమితి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ కూలీలు పాల్గొనడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *