యడ్లపాడు మండల ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రెహ్మాన్ ఖాన్..

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 యడ్లపాడు మండల ప్రతినిధి యడ్లపాడు మండలము మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ యడ్లపాడు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రెహ్మాన్ ఖాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుమ పండుగ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ పండుగగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఈ పండుగను జరుపుకొని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే యడ్లపాడు మండల ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో మరింత ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కనుమ పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *