వేము నరేందర్ రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన: బాషిపాక యాదగిరి

పయనించే సూర్యుడు, జనవరి 17 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డిని వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషిపాక యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేము నరేందర్ రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డివి జన్‌లో పార్టీ కార్యకలాపాలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సంక్షిప్తంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రయోజన పథకాలను క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *