గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశం

పయనించే సూర్యుడు జనవరి 17 పాపన్నపేట, పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీఎం కప్ క్రీడలు గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశమని పాపన్నపేట ఎంపీడీఓ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రం పాపన్నపేటలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఈ పోటీల ద్వారా విద్యార్థుల లోని క్రీడా ప్రతిభను గుర్తించే అవకాశముందని, గ్రామాల లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్బంగా ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజేందర్, నాగరాజు, రమేష్, రేణుక, కృష్ణకాంత్, మంగ నర్సింలు, అంజాగౌడ్ తదితరులు ఉన్నారు.