బోధన్ లో సీఎం కప్ క్రీడాల కాగడ ప్రదర్శన ర్యాలీ.

* బోధన్ లో కాగడాలను ప్రదర్శిస్తున్న అధికారులు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 బోధన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సీఎం కప్ క్రీడాల నిర్వహణలో భాగంగా శనివారం బోధన్ పట్టణ కేంద్రంలో మండల ప్రజాపరిషత్ వారి ఆధ్వర్యంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద క్రీడా కాగడాను ప్రదర్శించి మండల ఎంపీడీవో కిషోర్ ఏసిపి శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ, బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగయ్య ర్యాలీలో పాల్గొన్నారు. బోధన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి శక్కర్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుంది.ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకట్ నారాయణ, మండల ఎంఈఓ నాగయ్య, పట్టణ మరియు మండల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *