మీ ఓటుతోనే మన డివిజన్ అభివృద్ధికి పునాది: ఎండి రహీం

* మూడో డివిజన్ అభ్యర్థి ఎండి రహీం

పయనించేసూర్యుడు, జనవరి 18, రామగుండంమండలం(విద్యాసాగర్): మీ ఓటుతోనే మన డివిజన్ అభివృద్ధికి పునాది వేద్దామని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ అభ్యర్థి ఎండి రహీం అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోన్లు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మూడో డివిజన్లో జరగబోయే ఎన్నికల్లో డివిజన్ ప్రజలు ఇతర ప్రబోవాలకు గురికాకుండా గత పది సంవత్సరాలుగా ఎలాంటి పదవులు లేకున్న ప్రభుత్వ సలహాదారులు అర్క వేణుగోపాలరావు, రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ సహాకారాలతో డివిజన్లోని ప్రధాన సమస్యలు పరిష్కారానికి కృషి చేశానని కావున రాబోవు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో డీజిల్ ప్రజలు నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *