ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోండి. ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా సోమవారం పలాస శాసన సభ్యులు గౌతు శిరీష ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు పసుపోషకులు వినియోగించుకోవాలని కోరారు. పలాస నియోజకవర్గంలో గల అన్ని గ్రామపంచాయతీలో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ శిబిరాల్లో ఉచిత పశువైద్య చికిత్సలు వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులు చికిత్స, శాస్త్రీయ పశుపోషణపై అవగాహన కల్పించనున్నట్లు పలాస ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందస పశువైద్యాధికారి డాక్టర్ దువ్వాడ శ్రీకాంత్, గోవిందపురం పశువైద్యాధికారి డాక్టర్ కే మధుబాబు, బొడ్డుపాడు పశువైద్యాధికారి డాక్టర్ చైతన్య, ఎల్ ఎస్ ఏ కె కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *