కారుచోలా గ్రామంలో వైసీపీ గ్రామస్థాయి కమిటీ సమావేశం..

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 యడ్లపాడు మండల ప్రతినిధి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపితం చేసే కార్యక్రమంలో భాగంగా, చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో ఎడ్లపాడు మండలం కారుచోలా గ్రామంలో గ్రామస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ, వైసీపీ బలం గ్రామస్థాయి కార్యకర్తలేనని, గ్రామ కమిటీలే పార్టీకి పునాది అని స్పష్టం చేశారు. జగనన్న పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు జరిగిన మేలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు ప్రజల మధ్య నిరంతరం ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, రాచమంటి చింతరావు, పల్నాడు జిల్లా వైసీపీ మైనార్టీ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా, యడ్లపాడు మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ రెహ్మాన్ ఖాన్, గ్రామ నాయకులు నరసయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలపరిచే దిశగా ఈ సమావేశం కీలకంగా నిలిచిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *