ముచ్చటగా మూడోసారి బోధన్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలి

* బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు పిలుపు.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 బోధన్ : మున్సిపల్ ఎన్నికలు ముచ్చటగా మూడోసారి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు అన్నారు. బోధన్ పట్టణంలోని సోమవారం అప్నా గార్డెన్స్‌లో, పురపాలక ఎన్నికల సన్నాహక కార్యక్రమం సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బీగాల గణేష్ గుప్తా విజి గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించుకోవాలని తద్వారా చైర్మన్ పదవినీ కైవసం చేసుకోవాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి న అనంతరం హామీల అమలు ఉసే మర్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలపై ప్రజలకు వివరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *