ఆర్వి బ్యూటీ జోన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి..

పయనించే సూర్యుడు మార్చి 6, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) మహిళా సార్థకత కోసం ప్రతి ఒక్క మహిళ తమకాలపై నిలబడే విధంగా ముందుకు వెళ్లాలని అందుకు గౌతమే ఆదర్శమని ఆర్ వి బ్యూటీ జోన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే గేట్ లైన్ ఎన్టీఆర్ స్టాట్యూ వద్ద నూతనంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్వి బ్యూటీ జోన్ ప్రారంభోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ మొదటినుంచి కష్టపడే నైజాం పైకి రావాలని ఆలోచనతో ముందుకు వెళుతున్న గౌతమి మరింత ముందుకు ఎదగాలని అందరికీ ఆదర్శం కావాలని కోరారు. అనంతరం గౌతమికి ఆశీస్సులు జ్ఞాపకను అందజేశారు. అదేవిధంగా బ్యూటిషన్ కోర్సు ఉత్తీర్ణత అయిన వారికి తమ సొంతగా నిలబడే విధంగా లోన్ సదుపాయాన్ని కల్పించేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం ప్రొప్రైటర్ గౌతమి మాట్లాడుతూ ఎల్లవేళలా నా ఎదుగుదల కోసం నన్ను ప్రోత్సహిస్తూ ఆశీస్సులు తెలియజేసిన లాయర్ పులగం రామకృష్ణ రెడ్డికి ధన్యవాదాలు అని అన్నారు. అలాగే ఆర్ వి బ్యూటీ జోన్ లో స్పెషల్ ఆఫర్స్ ఉంటాయని కాంబో ఆఫర్స్ ఉంటాయని సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా కేవలం 9 రూపాయల నుంచి 799 రూపాయల వరకు ఆఫర్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు సభ్యులు చేసుకోవాలని తెలిపారు. అలాగే యువతలకు భరోసా ఇస్తూ బ్యూటిషన్ కోర్సులో తరిఫీది ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆశీస్సులు తెలిపిన వారిలో సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్, దాసరి శ్రీనివాస్, గణేష్, లోవరాజు, మాజీ సర్పంచ్ మిరపల నరసయ్య, సోదా మంగరాజు, బీవి భాస్కర్, కుటుంబ సభ్యులు తల్లి జ్యోతి, కుమార్తెలు దేవి, హిందూ, హర్ష, సురేష్, రమణమ్మ మణిశంకర్ సుకన్య ఎరుపల్లి నారాయణ రావు, రిలయన్స్ సంస్థ మేనేజర్ అనిల్ కుమార్, ఏటీఎం సంస్థ ప్రతినిధులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *