జర్నలిస్టుల 14 డిమాండ్లు సాధన కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 4న నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 06.03 2026మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) జర్నలిస్టుల 14 డిమాండ్ల సాధన కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల4న నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని,తమ గళాన్ని వినిపించి,ఈ పోరాటాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుడికి, పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఐక్యత మరియు నిరంతర కృషి వల్లే ఈ కార్యక్రమం ఇంతటి ఘన విజయాన్ని సాధించింది. మీ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము. ఇట్లు అధ్యక్ష కార్యదర్శులు పుంగనూరు నియోజకవర్గం ఎపిడబ్ల్యూజేఎఫ్