పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 06.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) బోయకొండ గంగమ్మకుఆదాయంగా 3.0861000లు సమకూరినట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు గురువారం ఆలయంలో సంవత్సర కాలం పాటు కొబ్బరి చిప్పలు సేకరించుకునే హక్కుకు వేలం నిర్వహించగా రూ 54.70 వేలు తలనీలాలు సేకరించుకునే హక్కుకు రూ 27.15 లక్షలు పెద్ద భోగం చిన్న భోగం స్వీకరించుకునే హక్కుకు రూ 88.20 లక్షలు కొండ కింద టోల్గేట్ నిర్వహించుకునే హక్కుకు రూ 73 లక్షలు మరియు 15% జీఎస్టీ చీరలు రవికలు సేకరించుకునే హక్కుకు రూ 47.06 లక్షలు సెల్ఫోన్ లగేజీ భద్రపరుచుటకు రూ 18.20 లక్షలు ఆదాయంగా సమకూరిందని ఆయన వివరించారు ఈ వేలం పాటలలో చిత్తూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసి చిట్టెమ్మ పుంగనూరు రూరల్ సిఐ సాయిప్రసాద్ ఎస్ఐ చిన్న రెడ్డప్ప ఆలయ అధికారులు అర్చక సిబ్బంది పాల్గొన్నారు