పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చ08.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె నాగరాజ) గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పరిష్కరించాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు శనివారం స్థానిక మండల పరిపాలన భవనంలో ఎంపీడీవో తహసిల్దార్ కార్యాలయాల నందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం కావడంతో గ్రామీణ ప్రాంతాలందు ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు అంతేకాకుండా పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ప్రతి అధికారి సమస్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఆ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఉపాధి హామీ పనులపై మండల స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కూలీలు వలసలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం పంచాయతీల వారీగా సమీక్షించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య పూల చంద్రమౌళి ముని వెంకటప్ప మనీ కళ్యాణ్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు