పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 08,2026 :గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ జనసేన పార్టీలో సభ్యత్వం పొందిన ఉద్యమి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఎమ్మిగనూరు జనసేన పార్టీ నియోజక వర్గ ఇంచార్జీ రేఖగౌడ్ తెలిపారు, మండల కేంద్రమైన గోనెగండ్లలో శనివారం రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపును అందుకొని సభ్యత్వం పొంది భీమా సహాయం పొందిన విషయాలపై యువతకు అవగాహన కల్పించి సభ్యత్వాలను నమోదు చేయించారు, జనసేన ప్రతి కార్యకర్త మంగళవారం గడువు లోపు సభ్యత్వం పొందాడానికి స్థానిక సాదిక్ లను సంప్రదించమని కోరారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గానుగ బాషా, ఖాసిం సాహెబ్, మాలిక్, ఉత్తేజ్, సుబాన్, జాని, షఫీ, పాల్గొన్నారు,.