పయనించే సూర్యుడు: మార్చి 8/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె . విజయబాబు పెనుబల్లి మండలం, లంకాసాగర్ గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రజా పాలన – ప్రగతి పదంలో 90 రోజులు యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఖమ్మం జిల్లా వైద్య శాఖ వారితో పెనుబల్లి మండలం లంక సాగర్ గ్రామంలో పి హెచ్ సి లో ప్రజలకు ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ లంక సాగర్ ప్రజలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ఒక డాక్టర్ గా స్వయంగా వైద్యం అందించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఈ కార్యక్రమం లో పీహెచ్ సి డాక్టర్స్, ప్రభుత్వ ఉద్యోగులు,పెనుబల్లి మండలం అధ్యక్షులు పంది వెంకటేశ్వర రావు, పెనుబల్లి మండలం మరియు లంక సాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
