పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మర్చి 10 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ నరసింహపురంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళు బొజ్జిరెడ్డి కి స్థానిక సర్పంచ్ కాక అరుణకుమారి వివిధ సమస్యలపై వివరించారు, గతంలో అనేక సందర్భాల్లో కొంతమంది కిడ్నీ వ్యాధి బాధితులు మా ఏజెన్సీ గ్రామాల్లో మరణించడం జరిగింది, అని అలాగే మాకు జిపిఎస్ స్కూల్ డేస్ కోడ్ నాలుగైదు సంవత్సరాలు నుండి దరఖాస్తు రూపంలో చింతూరు ఐటీడీఏ లో కూడా ఎన్నోసార్లు ఇవ్వడం జరిగిందని అయిన వీటి పైన ఏ అధికారి కూడా ఎటువంటి చర్యలు ఇప్పటివరకు చూపలేదని కమీషన్ దృష్టికి ఈరోజు చిడుమూరు సర్పంచ్ వివరించారు, ఆయన దీనిపై దృష్టి పెట్టి ఈ సమస్యను తీర్చే విధంగా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు.