పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 10 పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గట్టు మూల వద్ద గల వేమూరి కన్వెన్షన్ హాల్ నందు పెనుగంచిప్రోలు మండలం, గుమ్మడిదుర్రు గ్రామానికి చెందిన పోలంపల్లి మున్నేరు డ్యాం చైర్మన్ పొన్నం బాలాజీ, విజయలక్ష్మి దంపతుల మనవడు, పొన్నం వరుణ్ – కావ్య దంపతుల కుమారుడు “చి” రామ్ అన్నప్రాసన వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , శ్రీరాం శ్రీదేవి (అమ్మాజీ) దంపతులు హాజరై చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. చిన్నారి రామ్ మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
