పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్: విద్యుత్ శాఖలోని సుమారు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేపు (మార్చి 10న) హైదరాబాద్లోని (టీజీఎస్పీడీసీఎల్) కార్యాలయం ముందు ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు టి.వి.ఏ.ఈ. జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు: విద్యార్హతలకు అనుగుణంగా కేడర్ మార్పులు చేయాలి. పని ఆధారిత కూలీలందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. విద్యుత్ శాఖలో ఒకే సంస్థ - ఒకే విధమైన నియమాలు అమలు చేయాలి. ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మెకు వెళ్తామని జేఏసీ నాయకుడు మిద్దె శ్రీనివాసులు హెచ్చరించారు. కార్మికులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మంగి విల్సన్ కొంకలి లోకేష్ శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు