బోధన్ మున్సిపాలిటీలో పారిశుద్ధ పనులు

పయనించే సూర్యుడు న్యూస్ 11 బోధన్ : మున్సిపాలిటీ పరిధిలోని 4, 23 వార్డులోని మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి దృష్టి సాధించిన అధికారులు దోమల బెడదను నివారించేందుకు వార్డుల్లోని వీధుల్లో మలాథియన్ మందును పిచికారి చేయించారు. ప్రజా రవాణాకు ఇబ్బందిగా మారిన ముళ్ళ పోదాలను యంత్రాలతో తొలగించారు. పట్టణ ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా వార్డులలో ఎటువంటి పనులు చేపడతామని మున్సిపల్ అధికారులు తెలిపారు.