పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 12 జగ్గయ్యపేట మండలము, తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు జరుగుచున్న నిత్యాన్నదాన పధకమునకు ఖమ్మం వాస్తవ్యులు కీర్తిశేషులు అనంత పద్మావతి జ్ఞాపకార్థం వారి భర్త అయిన వెంకటేశ్వర్లు రూ.10,116/- రూపాయలు విరాళముగా అందజేసియున్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా సిబ్బంది శ్రీ స్వామి వారి ప్రసాదములు అందజేయుట జరిగినది అని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నూతక్కి సాంబశివరావు తెలియజేసియున్నారు.