పయనించే సూర్యుడు-13-03-2026-రాజంపేట న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదహారవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆకేపాటి భవన్ నందు కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర, దండు గోపి, అమర, శివయ్య, ఓబయ్య, మనోహర్ రెడ్డి, రఘునాథరెడ్డి, పెంచలయ్య, సురేఖ, శ్రీవాణి, చికెన్ శీను, మైనారిటీ నాయకులు జాహిద్ అలీ, గోవింద బాలకృష్ణ, కళ్యాణ్ రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీకృష్ణ లాడ్జి శీను, కిషోర్, శీను తదితరులు పాల్గొన్నారు.