టెన్త్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు గ్రామ పెద్దల అభినందనలు

పయనించే సూర్యుడు మార్చి 15 (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలం నాగులంచ గ్రామంలో ఈరోజు నుండి ప్రారంభమైన టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల సందర్భంగా గ్రామ పెద్దలు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పుష్పాలు అందజేసి “ఆల్ ది బెస్ట్” చెబుతూ వారి విజయాన్ని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వంకాయలపాటి వెంకట లచ్చయ్య, వంకాయలపాటి త్రివేణి, వంకాయలపాటి శివ, సామినేని బాబురావు, తోటకూరి నాగేశ్వరరావు, అంబటి సైడేశ్వరరావు, శ్రీ గ్లోబల్ హై స్కూల్ కరస్పాండెంట్ ఇనుకుల దివాకర్ రెడ్డి మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఫోటోలో గ్రామ పెద్దలు విద్యార్థులకు పుష్పాలు అందజేస్తూ అభినందనలు తెలియజేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *