ఉట్నూర్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో గ్రామాల అభివృద్ధి లక్ష్యం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

పయనించే సూర్యుడు మార్చి 16 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్ : ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారికి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అబివృద్ధి లో కార్మికుల పాత్ర కీలకం వారి వేతనాల సమస్య ఉంటే ప్రజా ప్రతినిధుల ద్వారా పరిష్కరించుకోవాలి ప్రజా ప్రభుత్వం చిన్న మధ్యతరగతి ఉద్యోగులకు అండగా ఉంటుంది అన్నారు మున్సిపాలిటీల తరహా మేజర్ గ్రామ పంచాయతీల అబివృద్ధి ఉండాలి అబివృద్దికి అవసరమైన నిధులు కేటాయిస్తా అందరి సహకారం తోనే గ్రామం అబివృద్ధి చెందుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు కార్మికులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.