పయనించే సూర్యుడు మార్చ్ 17 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఈ కార్యక్రమంలో సిపిఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావిరాజు వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొత్తూరు గంగన్న రైతు సంఘం నాయకులు చిన్న హనుమంతు ఏఐటియుసి జిల్లా సమితి సభ్యులు శిక్షావలి కల్లుబావిరాజు మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతమైన వై పి ఆర్ కాలనీలో గత చాలా సంవత్సరాల నుండి మంచినీటి సమస్యపై ఆ కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి ఇంటికి ( నల్లా) కుళాయిలు సమకూరుస్తామని చెప్పిన ప్రభుత్వాలు ప్రజలకు మంచినీరు అందించడంలో విఫలమవుతున్నారని ఐదు రోజులకు ఒకసారి కేవలం 20 నిమిషాలు నీటిని వదిలిచేతులుదులుపుకుంటున్నారని కొళాయి నీళ్లు పోయిన ఆధారపడిన ప్రజలు వారి రోజువారి కార్యక్రమాలు తీర్చుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైపిఆర్ఏ కాక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమంది ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని దక్షిణం ఆ కాలనీ మరియు ఆ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే వలసినదిగా కోరుచున్నాము లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని సంబంధిత అధికారులకు విన్నవించుకుంటున్నాము.
