ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, చిన్య తండా లో ఓ అత్త కోడల ఆవేదన

పయనించే సూర్యుడు: మార్చి 19/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె .విజయబాబు మా లోతు సాలి అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు 20 ఏళ్ల క్రితం ఎవరి వాటా వాళ్ళకి నేను, నా భర్త ,కలిసి కుమారులకు పంచిపెట్టడం జరిగింది, నా భర్త చనిపోయాడు ఇప్పుడు, నా పెద్ద కుమారుడు కూడా చనిపోయాడు నా పెద్ద కోడలు, నా మనవడు నేను కలిసి ఉంటున్నాము.. నా చిన్న కోడలు నా ఆస్తి నీ నా భూమిని స్వాధీనం చేసుకుని నాకు ఇవ్వడం లేదు ,నేను నా భర్త కలిసి కష్టపడి సంపాదించుకున్న భూమిని, లాక్కుంటే నేనెలా బ్రతికేది? అలాగే నాకు పెన్షన్ రాకుండా నా ఆధార్ కార్డులు, నా భూమి కాగితాలు దౌర్జన్యంగా నేను లేని సమయాన నా ఇంటికి వచ్చి దొంగలించుకుని వెళ్ళిపోయింది ,ఈ వృద్ధాప్య సమయంలో నేనేం చేయగలను? నాకు ఆశ్రయము ఏది? లేకుండా చేస్తుంది.. నాకు భర్త లేడు కొడుకు లేడు, నాకు సహాయం చేయండి అని వేడుకుంటున్న మాలోతు సాలి మాలోతు రాజలి.