పారిశుద్ధ్య కార్మికుల తో కలిసి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న సర్పంచ్ దాసరి రమేష్

పయనించే సూర్యుడు మార్చి 19 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం ఖానాపూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించి మందులను అందించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని వారి ఆరోగ్యం కోసం నెలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సుప్రజ తదితరులు పాల్గొన్నారు